‘సైరా’ ట్రైలర్ లో ఆ పవర్ మిస్ !

రేంద రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో బుధవారం సైరా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఐతే, ట్రైలర్ లో ఆ పవర్ మిస్సయింది. సైరా టీజర్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఐతే, ట్రైలర్ పవన్ వాయిస్ వినిపించలేదు. ఇక సినిమాలో మాత్రం పవన్ వాయిస్ వినిపిస్తుందని రామ్ చరణ్ తెలిపారు. కొన్ని సన్నివేశాలు పవన్ వాయిస్ ఓవర్ తో వస్తాయి అన్నమాట. ఈ విషయాన్ని టీజర్ రిలీజ్ సమయంలోనే చిరు చెప్పిన సంగతి తెలిసిందే.