బందోబస్త్ సరిపోలేదు  


కె.వి ఆనంద్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య నటించిన చిత్రం ‘బందోబస్త్’. మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలో నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బందోబస్త్’పై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొంది. ప్రతినాయకుడు వేసే ఎత్తులు, దాన్ని తిప్పికొట్టే విధానం ఇవన్నీ ఫస్టాఫ్ లో అదిరిపోయాయ్. కానీ, సెకాంఢాఫ్ లో కథ-కథనం అదుపుతప్పాయని చెబుతున్నారు.

ద్వితీయార్థంలో కథ, కథనం పూర్తిగా పట్టు తప్పాయి. ప్రధాని రక్షణ వలయం మరీ ఇంత అజాగ్రత్తగా ఉంటుందా? ఒకే ఒక్క వ్యక్తి… దేశ ప్రధానిని చంపడానికి ఇంట్లో కూర్చుని స్కెచ్ లు వేస్తే పట్టించుకునే వ్యవస్థ లేదా? అనే అనుమానాల్ని రేకెత్తిస్తుందీ చిత్రం. ఆయా సన్నివేశాలు పెద్దగా పండలేదు. పతాక సన్నివేశాలు పేలవంగా సాగాయి. కథ ఎంత పకడ్బందీగా మొదలెట్టారో, అంత పేలవంగా ముగించారు. వినోదానికి ఏమాత్రం ఆస్కారం లేని కథ ఇది. మొత్తంగా బందోబస్త్ సరిపోలేదని చెబుతున్నారు.