శివ ప్రసాద్ కన్నుమూశారా ?

తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ శివ ప్రసాద్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆయన చెన్నైలో అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఏ క్షణమైన విషాదవార్త రావొచ్చనే ప్రచారం జరిగింది. ఐతే, కొద్దిసేపటి నుంచి శివప్రసాద్ కన్నుమూశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్స్ శివప్రసాద్ ఇకలేరని పేర్కొన్నాయి. ఐతే ఈ ప్రచారంలో నిజం లేదటని సమాచారమ్.

శివ ప్రసాద్ మరణవార్తపై ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ స్పందించారు. శివ ప్రసాద్  కిడ్నీ వ్యాధితో  బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు. అధికారికంగా తాము ప్రకటించే వరకూ వందతులను నమ్మవద్దని ఆయన కోరారు. మరోవైపు, శివ ప్రసాద్ ని పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చెన్నై బయలుదేరి వెళ్లారు. బాబు చెనై ఆసుపత్రికి వెళ్లిన తర్వాత శివప్రసాద్ అరోగ్యంపై నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.