ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ


తెలంగాణలోని మహిళలకి ప్రభుత్వం బతుకమ్మ కానుకలని రెడీ చేసింది. బతుకమ్మ చీరలని పంపిణీ చేయనుంది. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 24 నుంచి 30 వరకు గ్రేటర్ హైదరాబాద్ లో బతుకమ్మ చీరలని పంపిణీ చేస్తామని తెలిపారు. 

ఇక త్వరలోనే సినిమా టికెట్స్ అమ్మకాల విషయంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందన్నారు. ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మాలని చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. దీనివలన నిర్మాతలు, పంపిణీ దారులకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. మరీ.. ప్రభుత్వ ఆలోచనపై సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.