‘సైరా’ డైలాగ్ ని లీక్ చేసిన పృధ్వీ !


సైరా నుంచి పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి లీకైంది. హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరుగుతోంది. ఈ వేదికపై మాట్లాడిన నటుడు 30ఇయర్స్ పృధ్వీ అభిమానుల కోసం ఓ డైలాగ్ చెప్పారు. ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్ ఇది. తాను ఇప్పటికే ఆ డైలాగ్ ని రింగ్ టోన్ పెట్టుకొని నేనే వింటున్నా. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఎవ్వరికీ చెప్పకూడదని నేనొక్కడినే వింటున్నా. అయితే ఇంటర్వెల్ ముందు తాను చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటూ.. తాను చెప్పిన డైలాగ్ చెప్పేశారు.

“నరసింహా స్వామి మళ్లీ పుట్టాడు దొరా.. పూర్వం హిరణ్యకశ్యుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. వాడికి చావే లేదని విర్రవీగేవాడు. వాన్ని చంపటానికి నరసింహ స్వామి స్థంభాని చీల్చుకొని వచ్చాడు దొరా. వాడి చావు ఇంటా కాదు.. బయటా  కాదు. పగలు కాదు.. రేయి కాదు. నింగికాదు.. నేల కాదు. సంహారాం జరిగింది. ఆ సంహారంతో ఆ అవతారం ముగిసింది. ఈ సంహారంతో ఈ అవతారం మొదలైంది దొరా” అంటూ నేను చెప్పిన డైలాగ్ ఇది.  ఇంతకన్నా ఏం కావాలి. అన్నయ్య ప్రక్కన ఇలాంటి డైలాగ్. ఆ మెగాస్టార్ ని పొగుడుతూ.. సైరా నరసింహారెడ్డిగా వస్తున్నాడురా.. మీ తాట తీయడానికి.. రికార్డులు బద్దలు కొట్టడానికి అన్నారు పృధ్వీ.