‘సైరా’ సెన్సార్ రివ్యూ


మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అద్భుతంగా ఉందని కితాబిచ్చారని సమాచారమ్. చరిత్రాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా తెరకెక్కించారట. రొమాలు నిక్కబోడిచే సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయట. క్లైమాస్ ఐతే అద్భుతం అంటున్నారు.

తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.