అసలు సినిమా ఇప్పుడే మొదలైంది

అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా టీడీపీ యువ నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.

“పోలవరంలో దోచుకున్న సొమ్మును వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. ప్రజలు తుపుక్కుమని ఉమ్మడంతో నడుములిరిగేలా నేలపై పడ్డాడు. డ్యాం పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయి.ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని వెతుకుతున్నాడు.అసలు సినిమా ఇప్పుడే మొదలైంది”

“పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ దబాయించాడు
@ncbn. లాంచి ప్రమాదానికి ప్రైవేటు వ్యక్తులు కారణమైనా బాధ్యత ప్రభుత్వానిదే అని@AndhraPradeshCM గారు హుందాగా అంగీకరించారు. నాయకుడికి, ఈవెంట్‌ మేనేజర్‌కు మధ్య తేడా ఇదే” అంటూ వరుస ట్విట్ చేశారు విజయసాయిరెడ్డి.

మరోవైపు, అమరావతి కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చేవేతని ప్రారంభించారు. ఐదు ఇళ్లను కూల్చేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్మాణాల కూల్చేవేత ప్రారంభం అయింది. ఇటీవలే చంద్రబాబు నివాసం కూల్చివేతపై రెండోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.