వేణు మాధవ్’ని మరోసారి చంపేశారు


ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ చనిపోయాడనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వేణు మాధవన్ ఆరోగ్యపరిస్థితి ఏం బాగలేదు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 6న సమస్య తీవ్రంకావడంతో వేణు మాధవ్ సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడగానే తిరిగి ఇంటికి వెళ్లారు. మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మళ్లీ యశోదా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వేణు మాధవ్ కి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు సమాచారమ్.

మరోవైపు వేణు మాధవ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకి సంతాపం తెలుపుతూ పోస్టులు, వీడియాలు పోస్ట్ చేస్తున్నారు. వేణు మాధవ్ విషయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇలాంటి న్యూస్ వచ్చింది. ఆ సమయంలో వేణు మాధవ్ సీరియస్ అయ్యారు. పోలీసులకి ఫిర్యాదు చేశారు. న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన అనారోగ్యానికి గురికావడంలో.. ఏకంగా ఆయన చనిపోయారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది వేణు మాధవ్ కుటుంబాన్ని, ఆయన అభిమానులకి బాధని కలిగిస్తోంది. కొద్దిగా నిజాలు తెలుసుకొని స్పందించాలని కోరుతున్నారు.