సైరాకు లైన్ క్లియర్


మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’. సురేంధర్ రెడ్డి దర్శకుడు. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, సైరా చిత్రబృందం తమకి అన్యాయం చేసిందని ఉయ్యాలవాడ వారసులు న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా విడుదలని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ ని విచారించిన కోర్టు.. తీర్పుని సోమవారానికి వాయిదా వేసింది.

సైరా చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ కోర్టుకి తెలిపింది. ఈ నేపథ్యంలో సైరా విడుదలపై అనుమానాలు కలిగాయి. ఐతే, కొద్దిసేపటి క్రితమే సైరాకి సెన్సార్  క్లియరెన్స్ లభించాయి. సెన్సార్ సర్టిఫికెట్ ని నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సైరాకు చిక్కులు తొలగాయ్. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రావడానికి లైన్ క్లియర్ అయినట్టుంది. మరీ.. ఉయ్యాలవాడ వారసులు వేసిన పిటిషన్ పై కోర్టు ఏం తీర్పునిస్తుందనేది చూడాలి.