పంత్ భీకరమైన మ్యాచ్‌ విన్నర్‌


టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ భీకరమైన మ్యాచ్‌ విన్నర్‌ అని అన్నారు కోచ్‌ రవిశాస్త్రి. పంత్ పేలవ ఫామ్ పై స్పందించిన శాస్ట్రీ స్పందించారు. “పంత్‌ భిన్నమైన ఆటగాడు. ప్రపంచ స్థాయి క్రికెటర్‌. భీకరమైన మ్యాచ్‌ విన్నర్‌. అంతర్జాతీయ క్రికెట్లో కొద్దిమందే అలా ఉన్నారు. తెలుపు బంతి, టీ20 క్రికెట్లో అలాంటి వారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అతడితో ఓపికగా మెలగడమే ముఖ్యం. విశ్లేషకులు, మీడియా నుంచి ఏవేవో కథనాలు వస్తాయి. టీమిండియాలో అతడికి మంచి చనువు ఉంది. పంత్‌ ఇప్పటికే చాలా చేశాడు. కాలం గడిచే కొద్దీ నేర్చుకుంటాడు. జట్టు యాజమాన్యం ప్రోత్సాహం అతనికెప్పుడూ ఉంటుంది. మేం అతడిపై ఒత్తిడి చేస్తున్నామన్నది అబద్ధం. పొరపాట్ల గురించే పంత్‌తో మాట్లాడతానని చెప్పాను. ఎవరైనా మూర్ఖంగా ఆడితే నేనే కదా వాళ్లకి చెప్పాలి. తబలా వాయించడానికా నేను అక్కడుంది? పంత్‌ ఒక విధ్వంసకర ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగేందుకు అతడికి సరైన ప్రోత్సహం అందిస్తాం” అన్నారు శాస్త్రీ.