సైరా రెండో ట్రైలర్ వచ్చేసింది !


మెగాస్టార్ చిరంజీవి నుంచి బోనస్ గిఫ్ట్ వచ్చేసింది. సైరా సెకండ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. టాక్స్ లన్నీ 300శాతం పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ల బంగారంతో తిరిగిరావాలని..  ఆంగ్లేయుడి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. మరోవైపు ఆంగ్లేయుల దోపిడిని ప్రతి ఘటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్ది..  ‘అది మనది. మన ఆత్మ గౌరవం. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు అంటూ వీరోచిత పోరాటాన్ని చూపించారు. మధ్యలో అమితాబ్ ‘గెలవడమో.. చావడమో ముఖ్యం కాదు. గెలవడం ముఖ్యమని’ నరసింహారెడ్డి గీతోపదేశం చేయడం చూడొచ్చు. చివరలో ఉరితాడు ముందు నిల్చొని.. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణనికి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్రం.. స్వాత్రంత్రం.. స్వాతంత్రం అంటూ గర్జించడం చూడొచ్చు. 

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్దిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు.  నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.