వేణు మాధవ్ మృతి పట్ల యూసఫ్ పఠాన్ సంతాపం


హాస్యనటుడు వేణు మాధవ్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో వేణుమాధవ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్‌ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. అంతకుముందు పలువురు, సినీ రాజకీయనాయకులు వేణుకి నివాళులు అర్పించారు.

ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన ట్విట్టర్ ద్వారా వేణు మాధవ్ మృతికి సంతాపం తెలియజేయడం విశేషం. ‘వేణు మాధవ్ చనిపోయారనే వార్త నన్ను షాక్‌కి గురి చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై నేను చూసిన అద్భుత కమెడీయన్స్‌లో ఆయన ఒకరు. అతనిని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయనకి నా నివాళులు. కుటుంబ సభ్యులకి, మిత్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’నని యూసఫ్ ట్విట్ చేశారు. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ సినిమాలని ఉత్తరాది ప్రేక్షకులు చూస్తుంటారు. బహుశా.. యూసఫ్ వేణు మాధవ్ కి అలా అభిమాని అయి ఉంటారేమో..!