హౌస్‌ఫుల్-4 ట్రైలర్ టాక్


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్-4’. ఈ చిత్రానికి ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్ కి జంటగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జంటగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జంటగా కృతి కర్బంద నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న హౌస్‌ఫుల్-4  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.

తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. పునర్జమ్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో కామెడీ హైలైట్ గా ఉండనుందని ట్రైలర్ తో అర్థమవుతోంది. 600 ఏళ్ల తర్వాత పుట్టిన స్టార్స్ ఏ రకంగా ప్రేక్షకులని అలరించనున్నారనేది సినిమాలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అక్షయ్ కుమార్..రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో నటించారు. 1419కి చెందిన రాజకుమారుడు బాలా.. 600 ఏళ్ల తర్వాత లండన్ నుంచి హ్యారీగా తిరిగి వస్తాడు.