అతడి దూకుడుకి సరిలేరు !


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా ఓ మిక్షర్ పొట్లం అనే ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాల్లో అతడు, దూకుడు సినిమాలు ప్రత్యేకమైనవి. ‘అతడు’లో ఫ్యామిలీ ఎమోషన్స్, దూకుడులో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ కీలకమైనవి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో ఈ రెండు ఉండబోతున్నాయట. వాటిని అనిల్ రావిపూడి తనదైన మార్క్ తో ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. అంటే.. అతడు+దూకుడు= సరిలేరు నీకెవరు అని భావించాలేమో.. !

ఇక అనిల్ రావిపూడి కథ కంటే టేకింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎంటర్ టైనింగ్ కథని చెప్పడం అనిల్ ప్రత్యేకత. ఐతే, సరిలేరు నీకెవ్వరులో మాత్రం ఆయన కథపై కూడా శ్రద్ద పెట్టినట్టు చెబుతున్నారు. ఈ సినిమాతో అనిల్ మంచి కథకుడు అనిపించుకొంటాడట. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాత్ర అతడులో నాజర్ పాత్ర తరహా, ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ పాత్ర తరహా రెండు షేడ్స్ లో ఉండనుందని సమాచారమ్. ఇక సినిమాలో ట్రైన్ సీన్ హైలైట్ గా నిలవనుందని టాక్.