శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ 


తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.గోవింద నామస్మరణతో తిరుగిరులన్నీ మార్మోగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పరివట్టం చుట్టారు. అనంతరం ఆయన పట్టువస్త్రాలు ఉంచిన వెండి పళ్లేన్ని తలపై ఉంచుకు ని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. పట్టువస్త్రాలని శ్రీవారికి సమర్పించారు.అనంతరంం పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు.