బ్యాంకుల కొత్త పనివేళలు.. ఇవే !


ఏపీలో బ్యాంకుల పనివేళలు మారాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకే రకమైన పనివేళలు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం తీసుకోవాలి. కొత్త పనివేళలు ఇవాళ్టీ (అక్టోబర్1) నుంచే అమలులోనికి రానున్నాయి.