బోటు వెలికితీత : బాలాజీ మెరైన్స్‌ తొలి ప్రయత్నం విఫలం


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గల్లంతైన బోటును బయటకు తీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండోరోజు బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నం విఫలమైంది. బోటును గాలించేందుకు నదిలో వదిలిన రోప్‌ తెగిపోవడంతో కాసేపు వెలికితీత పనులు నిలిచిపోయాయి. అనంతరం మరో రోప్‌ సాయంతో పనులు మొదలుపెట్టారు. బహుశా లంగర్లు కొండరాళ్ళకు పడిఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు మరోసారి బోటుని వెలికి తీసే ప్రయత్నం చేయనుంది బాలాజీ మైరైన్స్ సంస్థ.