మహేష్ సినిమా కలరింగ్ ఎక్కువైందిగా.. !


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాని కలర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇందులో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే టైటిల్, ఐటమ్ సాంగ్స్ ఇస్తుంటారు. సరిలేరు నీకెవ్వరులోనూ ఈ రెండు సాంగ్స్ అదిరిపోయేలా ప్లాన్ చేశారట. ఇంకో విశేషం ఏంటంటే.. ?

సరిలేరు టైటిల్ సాంగ్ లో మిల్కీబ్యూటీ తమన్నా మెరవనుందట. ఇక ఐటమ్ సాంగ్ కోసం పూజా హెగ్డేని తీసుకొన్నట్టు సమాచారమ్. మహర్షి సినిమాలో మహేష్ కి జంటగా నటించింది పూజా. ఇప్పుడు మహేష్ ఐటమ్ గా మారబోతుంది. ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోయిన్స్, వీరికితోడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఉన్నారు. చూస్తుంతే.. ఈ సినిమాలో కలరింగ్ మరీ.. ఎక్కువైనట్టుంది. ఈ చిత్రాన్ని  గీతా ఆర్ట్స్, రామబ్రహ్మం సుంకర్, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.