యాడ్ వివాదంలో అంజలి 


హీరోయిన్ అంజలి చిక్కుల్లో పడింది. ఆమె చేసిన ఓ యాడ్ వివాదాస్పదమైంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న అంజలి అప్పుడప్పుడు యాడ్స్ లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా సైడ్ ఇన్ కం వస్తోంది. ఐతే, ఆమె ప్రచారం చేసిన ‘వంట నూనె కంపెనీ’పై ఆహార భద్రత శాఖ అధికారులకి ఫిర్యాదు అందింది. కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యత గల నటి అయి ఉండి అంజలి నాసిరకం నూనెను ఎలా ప్రచారం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ ఫిర్యాదుతో అంజలి యాడ్ వివాదంపై తమిళ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై అంజలి ఇంకా స్పందించాల్సి ఉంది.అంజిలి ఒక్కరే కాదు.. చాలామంది హీరో-హీరోయిన్స్ యాడ్స్ లో నడిస్తున్నారు. డబ్బులు గడిస్తున్నారు. కానీ, ఆయా వస్తుల్లో ఎంత మేరకు నాణ్యత ఉందని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తాజా అంజలి యాడ్ వివాదమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అంజిలి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆమె తెలుగులో ‘గీతాంజలి’ సీక్వెల్ లో నటించనున్నారు.