మహేష్ మళ్లీ ఫారిన్ ట్రిప్.. ఈ సారి ఎక్కడికో తెలుసా ?


‘మహర్షి’ సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లొచ్చినట్టు గుర్తు. ఇప్పుడు మరోసారి మహేష్ ఫ్యామిలీ కలిసి ఫారిన్ ట్రిప్ వేశారు. గురువారం రాత్రే మహేష్ ఫ్యామిలీ దుబాయ్ బయల్దేరింది. అక్కడ కొన్ని రోజులు జాలీగా గడిపిరానున్నారు. ఎయిర్ పోర్ట్ లో మహేష్ ఫ్యామిలీ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ నుంచి తిరిగొచ్చాక మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ లో తిరిగి జాయిన్ కానున్నారు.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ లో మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో మెరవబోతున్నట్టు సమాచారమ్. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.