మాధవన్ ‘నిశ్శబ్దం’ లుక్ చూశారా ?

భాగమతి తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమత్ మధుకర్ దర్శకుడు. ఇందులో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఆయన లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. మాధవన్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి అనుష్క ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

‘భాగమతి’ తర్వాత అనుష్క చాలా కథలని విన్నారు. అవేవీ ఆమెని సంతృప్తిపరచలేకపోయాయ్. నిశ్శబ్ధం కథని స్వీటీ ఏరికోరి ఎంచుకొన్నారు. ఇందులో స్వీటీ నటన అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది.  ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా సినిమాలో అనుష్క ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. సినిమా మొదట్లో.. చివరలో ఆమె కనిపించింది.