ఇచిత్రం :  తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు కొట్టించాడు


అప్పుడప్పుడు విచిత్రమైన వార్తలు వింటుంటామ్. వీడియోలు చూస్తుంటాం. ఇది కూడా ఈ కోవకి చెందినదే. ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని ఏకంగా భార్యకు గుండు కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని జోయ్‌పుర్హత్‌ జిల్లాలో జరిగింది. బాబ్లూ మొండల్‌ (35)కు తనకు వడ్డించిన అన్నం, పాలులో వెంట్రుకలు కనిపించాయి. దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. అంతటితో ఆగకుండా ఓ బ్లేడ్‌ అందుకుని ఆమెకు బలవంతంగా గుండుకొట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక మానహ హక్కుల సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శిక్షకు గురైతే గరిష్ఠంగా 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడపనున్నాడు.