సాహో+సైరా కలిస్తే.. !

టాలీవుడ్ నుంచి బ్యాట్ టు బ్యాక్ వచ్చిన ప్యాన్ ఇండియా సినిమాలు సాహో, సైరా. సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొంది. ఐతే, టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ తో మంచి కలెక్షన్స్ నే సాధించింది. కొన్ని ఏరియాల్లో లాభాలు, మరికొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. సాహో సినిమాకి నెల గ్యాప్ తో అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లని రాబడుతోంది.

ఇప్పుడు సాహో+సైరా కలిసిపోనున్నాయ్. దీనర్థం.. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి సినిమా ఉండబోతున్నదట. ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి  జాన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారమ్. సురేందర్ రెడ్డి కూడా ప్రభాస్ కోసం కథను రెడీ చేశాడని.. ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడమే తరువాయి అని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. వచ్చే యేడాది ప్రథమార్థంలో సురేంధర్ రెడ్డి-ప్రభాస్ ల సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.