సంజు శాంసన్‌ డబుల్ సెంచరీ


టీమిండియా వికెట్ కీపర్ గా పోటీ పడుతున్న యువ క్రికెటర్ సంజు శాంసన్. అంతేకాదు.. టీమిండియాలో నెం.4కి సంజు అర్హుడని సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు. తాజాగా సంజు తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకొన్నాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో కేరళ తరఫున ఆడుతున్న సంజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు, 20 ఫోర్లతో చెలరేగిన అతడు 129 బంతుల్లోనే 212 పరుగులు చేశాడు. ఫ్రొఫెషనల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత వేగంగా ద్విశతకం బాదిన వికెట్‌కీపర్‌గా సంజు రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్‌ ఆటగాడు అబిద్‌ అలీ (209*) పేరిట ఉండేది. అంతేకాదు.. విజయ్ హజారె ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సంజు రికార్డు నెలకొల్పాడు.