చిరు బీజేపీలో చేరబోతున్నారా ?

రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారా ? అనే చర్చ మొదలైంది. దీనికి కారణం చిరు ప్రధాని మోడీతో భేటీ కావడమే. బుధవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తో కలసి చిరు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ నేపథ్యంలో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? బిజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. ఐతే, చిరు ఢిలీ టూర్ పొలిటిక్స్ సంబంధించినది కాదట.

ఆయన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్  హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ప్రధాని మోడీని కలిసి సైరాని వీక్షించమని కోరాడని తెలుస్తోంది. మరీ.. మోడీ సైరాని వీక్షిస్తారా ? చిరు నటనని కొనియాడుతూ ట్విట్ చేస్తారా ? అన్నది చూడాలి. అదే జరిగితే.. సైరాకి మరింత మైలేజ్ దక్కినట్టే.