‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ టాక్ 

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. వాణి భోజన్ హీరోయిన్. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి సమీర్ దర్శకుడు. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

సెల్ ఫోన్ వాడకం దాని అనర్థాలపై రిసెర్చ్ చేసి.. మరీ తీనిమా అని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్ నటనతో అదరగొట్టేశాడు. మన లైఫ్ మన చేతిలో ఉందో ? లేదో ? తెలీయదు. కానీ, మనందరి చేతిలో కచ్చితంగా సెల్ ఫోన్ ఉంటుంది అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తనకి సంబంధించిన వీడియో ఒకటి లీకైన టెన్షన్ లో తరుణ్ భాస్కర్ ఉండటం ట్రైలర్ చూడొచ్చు. అదేంటీ ? అన్నది సినిమాలో చూడాల్సిందే. మొత్తానికి.. ట్రైలర్ అదిరిపోయింది.