మరీ.. అంత గట్టిగా గిల్లేయకు.. !

‘ప్రతిరోజు పండగే’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మారుతి దర్శకత్వంలో మెగా యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న చిత్రమిది. రాశీఖన్నా హీరోయిన్. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విడుదల సంక్రాంతికి ముందా ? వెనకా ? అనే సందిగ్థత నెలకొంది. తాజాగా ఆ సందిగ్థకి చిత్రబృందం తెరదించుతూ రిలీజ్ డేటుని ప్రకటించింది. డిసెంబర్ 20న రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

రిలీజ్ డేటుని తెలియజేస్తూ ఓ రొమాంటి పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో సాయి తేజు హీరోయిన్ రాశీఖన్నా బుగ్గులని గట్టిగా గిల్లడం.. ఆమె అబ్బా.. అంత గట్టిగా గిల్లకు అన్నట్టు సిగ్గుపడుతుండటం చూడొచ్చు. వాస్తవానికి ప్రతిరోజు పండగే చిత్రాన్ని సంక్రాంతి పండగ సీజన్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ, సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో ముందే పండగని ప్లాన్ చేశారు. మరీ.. తేజు ఈసారి ఫ్యామిలీతో మెప్పిస్తారా ? అన్నది చూడాలి.