‘దర్భార్’ అలాంటి సినిమా కాదు


రజనీకాంత్‌-మురుగదాస్‌ కలయికలో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దర్బార్‌’. నయనతార కథానాయిక.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా అని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని దర్శకుడు మురగదాస్ చెప్పిన.. ఆ ప్రచారానికి పులిస్టాప్ పడటం లేదు. తాజాగా దీనిపై మురగ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

“ఇది రాజకీయ నేపథ్యంతో నడిచే కథ కాదు. థ్రిల్లింగ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. మళ్లీ చెబుతున్నా, ఇది రాజకీయ సినిమా మాత్రం కాదు. ‘అలెక్స్‌ పాండియన్‌’లాంటి పోలీస్‌ ఆఫీసర్‌ కథ” మురగ మరోసారి స్పష్టం చేశారు. ఇందులో రజనీ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆయన పోలీస్‌ పాత్రను చేస్తుండటం విశేషం. నవంబరు 7న ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.