‘మహానటి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు


స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం ఈజీనే. కానీ, మహానటి అనిపించుకోవడం గొప్ప విషయం. ఈ తరం హీరోయిన్స్ లో కీర్తి సురేష్ మహానటి అనిపించుకొంది. మహానటి సావిత్రి బయోపిక్ లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు గానూ జాతీయ అవార్డుని సొంతం చేసుకొంది. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి సురేశ్‌. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేశారు. తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం ‘పైలట్స్‌’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన ‘గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’తో ఆమె తెలుగులో అరంగేట్రం చేశారు.

తెలుగులో ఆమె నటించిన రెండో సినిమా ‘నేను లోకల్’. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలని ఎంచుకుంటోంది. బాలీవుడ్ లోనూ కీర్తికి అవకాశాలు వస్తున్నాయ్. మొత్తంగా.. ఈ తరం మహానటి అనే ముద్ర వేయించుకొంది. ఆమె మరెన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాలని కోరుకుంటో ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి కామ్.