‘హౌస్ ఫుల్-4’ వింత ప్రచారం !


సినిమాని ఎంత బాగా తీశాం అన్నది ముఖ్యమే. దాన్ని అంతే బాగా జనాల్లోకి తీసుకెళ్లగలగాలి. దీని కోసం విన్నూతంగా సినిమా ప్రమోషన్స్ ని చేపడుతుంటారు. బాలీవుడ్ చిత్రం ‘హౌస్ ఫుల్-4’ టీం ఇప్పుడు తమ సినిమా ప్రమోషన్ కోసం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
 
ఈ చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా.. ఇండియన్ రైల్వేస్ సహకారంతో తమ సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఇందుకోసం ఓ లగ్జరీ రైలును రెంటుకు తీసుకున్నాడు. ఆ రైలు బయటా లోపలంతా హౌస్ ఫుల్ పోస్టర్లతో నింపేసి. ఈ చిత్రంలో నటించిన ప్రధాన నటీనటులు, టెక్నీషియన్లందరినీ తీసుకుని ముంబయి నుంచి ఢిల్లీకి టూర్ వేయబోతున్నాడు. ఈ తరహా ప్రమోషన్ ఇండియాలో తొలిసారి. హౌస్ ఫుల్-4 దీపావళి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.