షాక్ : సాహో నిర్మాతలపై కేసు నమోదు


భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ‘సాహో’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు రూ. 350కోట్లు ఖర్చుపెట్టింది. ఐతే, మిక్సిడ్ టాక్ తో కొన్ని ఏరియాల్లో భారీ నష్టాలు వచ్చినట్టు సమాచారమ్. అంతేకాదు.. సాహో తర్వాత ప్రభాస్ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ప్రభాస్ పూచీకత్తుతో తెచ్చిన అప్పులు ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారాయనే ప్రచారం జరిగింది. 

ఇందులో నిజమెంత ? అనేది తెలియదు. కానీ, తాజాగా సాహో నిర్మాతలకి ఓ సంస్థ షాక్ ఇచ్చింది. వారిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. విషయం ఏంటంటే.. ?  సాహో చిత్ర నిర్మాతలు తమ సంస్థ పేరును సినిమా సన్నివేశాల్లో ప్రదర్శిస్తామని నమ్మించి రూ.1.40కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఆర్క్‌టిక్‌ ఫాక్స్‌ బ్యాగ్స్‌ తయారీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.