దానికి దూరంగా రేణు దేశాయ్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో టచ్ లో ఉంటారు. పవన్ భార్యగా ఉన్నప్పుడు.. ఆయనకి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకొనేది. మెగా అభిమానులకి ఖుషి చేసేది. అందుకే మెగా అభిమానులు రేణుని వదినమ్మా.. వదినమ్మా.. అంటూ ఆప్యాయంగా పిలుచుకొనేవారు. ఐతే, పవన్ తో విడిపోయాక అదే మెగా ఫ్యాన్స్ రేణుని టార్గెట్ చేశారు. రేణు వర్సెస్ మెగా అభిమానుల మధ్య పెద్ద వారే జరిగిన సంగతి తెలిసిందే.

ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు.. కొంత కాలంగా దానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టా వేదికగా అభిమానులకు తెలిపారు. నేను ఇన్  స్టాగ్రామ్ ను బాగా వాడుతున్నాను. ఇన్ స్టా కి బాగా అలవాటుపడిపోయాను. అందుకే వెంటనే నేను కొన్నిరోజులపాటు ఇన్ స్టాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ మీ అందరిని వచ్చే వారం కలుస్తాననని రేణూ తెలిపారు.

ఇక రేణు పూణే నుంచి హైదరాబాద్ కి మకాం మార్చినట్టు తెలుస్తోంది. తనయుడు అకీరాని మెగా అభిమానులకి దూరం చేయకూడదనే రేణు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు.. త్వరలోనే అకీరాని తెలుగు తెరకు పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అకీరా ఎంట్రీ సినిమాని స్వయంగా రామ్ చరణ్ నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి.. రేణు పవన్ తో విడిపోయినా.. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.