కరెంట్ కొలువుల ప్రకటన వచ్చేసింది !


తెలంగాణలో కరెంట్ కొలువల నోటిఫికేషన్ వచ్చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) 3025 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు ప్రకటనలను బుధవారం విడుదల చేసింది. జూనియర్ లైన్ మెన్ (జేఎల్) పోస్టులు 2500, జూనియర్ అసిస్టెంటు(జేఏ) కం కంప్యూటర్ ఆపరేటర్ 500, జూనియర్ పర్సనల్ అధికారి(జేపీపీ) 25 పోస్టులకు ఈ ప్రకటనలు జారీచేసింది.

జేఏ పోస్టులకు ఈ నెల 31 నుంచి నవంబరు 20లోగా దరఖాస్తు చేయాలి. డిసెంబరు 22న రాతపరీక్ష ఉంటుంది. మిగతా రెండు రకాల పోస్టులకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేయాలి. వీటికి డిసెంబరు 15న రాతపరీక్షలున్నాయి. టీఎస్ సదరన్ పవర్. జీఓవీ.ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి. ఐతే, ఈ పోస్టులకు వయో పరిమితి 44 ఏళ్లుండగా తాజా ప్రకటనల్లో తగ్గించింది. జేఎల్ కు 35, మిగతా 2 రకాల పోస్టులకు 34ఏళ్ల లోపువారే దరఖాస్తు చేయాలనడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.