చంద్రబాబుకు మీడియా పిచ్చి


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి మీడియా పిచ్చి ఉందని ఆరోపించారు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు చినబాబు అదేనండీ.. నారా లోకేష్ ని టార్గెట్ చేయడం విజయసాయికి సరదా. అలవాటు. తాజాగా విజయసాయి చంద్రబాబు మీడియా ఫోకస్ పై ఆసక్తికర ట్విట్ చేశారు. 

“ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే @ncbn గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదు” అని రాసుకొచ్చాడు. ఇప్పుడీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబుకి మీడియా పిచ్చి ఉందో ? లేదో ? తెలీదు. కానీ, వీడియో కాన్ఫిరెన్స్ ల పేరుతో సొంత పార్టీ నేతల సహనాన్ని పరీక్షించే అలవాటు మాత్రం ఆయనకుందని చెప్పుకొంటున్నారు.