రేపటి బంద్’కు ఏపీ ఆర్టీసీ మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు గత 15రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్యచరణ ప్రకారం రోజుకో విధంగా ఆందోళనలని తెలియజేస్తున్నారు కార్మికులు. ఇక రేపు (అక్టోబర్ 19)న రాష్ట్రబంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపటి బంద్ కు ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. రేపు ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు, రేపటి రాష్ట్ర బంద్ కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రజలు బంద్‌కు సహకరించి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం కోరారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను కాపాడుకోవడం కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామన్నారు.