క్షేమంగా ఇంటికి చేరిన అమితాబ్

బిగ్ బీ అమితాబ్ అభిమానులకి గుడ్ న్యూస్. బిగ్ బీ క్షేమంగా ఇంటికి చేరుకొన్నారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న అమితాబ్ మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ముడ్నాలుగు రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బీ అనారోగ్యం క్షీణించిందనే ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు ఆందోళనకి గురయ్యారు.

ఐతే, శుక్రవారం రాత్రి అమితాబ్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. క్షేమంగా ఇంటికి చేరుకొన్నారు. భయపడాల్సిన పనిలేదు. అమితాబ్ ఆరోగ్యం కుదుటపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకొన్నారు. ఇక ఈ వయసులోనూ బిగ్ బీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో బిగ్ బీ కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.