మూడో టెస్ట్ : కష్టాల్లో టీమిండియా (61/3)

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదటి బ్యాటింగ్ ని ఎంచుకొంది. ఐతే, ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది.63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టు స్కోరు 12 పరుగుల వద్ద 10 పరుగులు చేసి రబడ బౌలింగ్ లో ఎల్గర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఛటేశ్వర్ పుజారా  పరుగులేమీ చేయకుండా రబడ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 12 పరుగుల వద్ద ఎన్రిచ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 29, రెహానే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు