‘డిస్కో రాజా’ పాటేసుకొన్నాడు !


వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్ పుత్, నభా నటాషా కథానాయికలు.సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో తమిళ నటుడు బాబీ సింహా ముఖ్య పాత్ర నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాట ‘నువ్వు నాతో ఏమన్నావో.. ‘ విడుదలైంది. సిరివెన్నెల సీతారామ శాస్రీ రాసిన ఈ పాటని ఎస్పీ బాలు ఆలపించారు. థమన్ సంగీతం అందించారు. పాత ట్యూన్ నే కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇళయరాజా కంపోజ్ చేసిన పాట మాదిరిగా ఉంది. ఆ పాటని మీరు ఓసారి వినేయండీ.. !