‘మా’ విభేదాలు భగ్గుమన్నాయ్

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌)లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయ్. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు లేకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ సమావేశం నిర్వహించడం రచ్చకి దారితీసింది.  

ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం పై మాటల దాడి చేసారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. మా మీటింగ్ కి వచ్చిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకొని వెళ్లారు.

మరోవైపు ‘మా’ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా ఉన్న ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ.. ‘మా’ అసోసియేషన్‌లో నెలకొన్న విభేదాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.  మా ఈసీ మెంబర్‌గా గెలిచినందకు ఆనందపడాలో.. బాధ పడాలో తెలియడం లేదన్నారు. ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఉందన్నారు.