రాముల.. రేపటికి వాయిదా !


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి నిరాశపరిచాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ సినిమా రెండో సింగిల్ ‘రాములో రాముల’ టీజర్ ని ఈరోజు (అక్టోబర్ 21) సాయంత్రం 4:05నిమిషాలకి విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కానీ, రాముల.. ఇంకా రాలేదు. రేపటి వాయిదా పడింది. రేపు సాయంత్రం 4:05నిమిషాలకి విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాయిదాకి గల కారణాలని మాత్రం వెల్లడించలేదు.

ఇక ఇప్పటికే వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకొంది. అత్యధిక మంది తొలి తెలుగు పాటగా రికార్డ్ నెలకొల్పంది. సామవరగమనకి 40మిలియన్ వ్యూస్, 7లక్షల లైకులు రావడం విశేషం. ఈ జోష్ లోనే అల.. నుంచి మాస్ సాంగ్ ‘రాములో.. రాముల’ని దీపావళీ కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి కీలక పాత్రలు దక్కాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.