తరుణ్ భాస్కర్ మరో కొత్త అవతారం

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా టర్న్ తీసుకొన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సమీర్ దర్శకుడు. వాణి భోజన్ హీరోయిన్. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే.. ? సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్ లపై పని చేయాలనుంది. భవిష్యత్ లో సినిమాటోగ్రఫర్, ఎడిటర్ గా పనిచేస్తానన్నారు. 

చెప్పినట్టుగానే ఇప్పుడు ఎడిటర్ గా మారారు.  సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రెజర్‌ కుక్కర్’.  సుజై, సుశీల్‌ దర్శకత్వం వహించారు. కరంపూరి క్రియేషన్స్‌ అండ్‌ మిక్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగా ఎడిటర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో ఈ చిత్ర టీజర్‌ను ఎందుకు కట్ చేయాలని అనిపించిందో తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇంకా అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా ఈ టీజర్ ఎడిట్‌లో భాగమవుతుందని, టీజర్ నచ్చితే అందరూ షేర్ చేసి లైక్ చేయమని తరుణ్ భాస్కర్ కోరారు.