అమిత్ షాతో జగన్ భేటీ 

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సోమవారమే అమిత్ షాతో జగన్ భేటీ కావాల్సి వుంది. ఐతే, హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భేటీ నేటికి వాయిదాపడిన సంగతి తెలిసిందే.

అమిత్ షాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 సమయంలో జగన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. ఏపీ రాజధాని అమరావతి మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం జగన్ అమిత్ షాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ భేటీలన్ని ముగిసిన తర్వాత సీఎం జగన్ మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది.