మహేష్ బిజినెస్ పార్ట్‌నర్ ఇంట్లో ఐటీ దాడులు

సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ పార్ట్‌నర్ నారాయణదాస్ ఇల్లు, ఆఫీస్, అతడి స్నేహితులు, బంధువుల ఇళ్లపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేతల్లో ఒకరు ఈ నారాయణదాస్. మహేష్ తో కలిసి ఏఎంబీ థియేటర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. 

అంతేకాదు.. ఇప్పుడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి అమీర్ పేటలోనూ ఏఎంబీ తరహా మల్టీప్లెక్స్ ని నిర్మించే పనిలో ఉన్నారు. ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఉన్న ఏషియన్ సినిమాస్ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాని నిర్మిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సంస్థకి సంబంధించి  8 మల్టీప్లెక్స్ లు, 12 సినీప్లెక్స్ లు ఉన్నాయి. 80కి పైగా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇక మంగళవారం జరిగిన ఐటీ దాడుల్లో ఏ మేరకు బ్లాక్ మణి పట్టుబడింది అన్న వివరాలు మాత్రం బయటికి రాలేదు. ఏఎంబీ ఆఫీసులోనూ ఐటీ దాడులు జరిగాయి.