కత్రినా బ్రాండ్ కు నయన్ ప్రచారం


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కొత్త బిజినెస్ ని మొదలెట్టింది. ఆమె సొంతంగా ‘కే బై కత్రినా’ అనే పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. తన బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇటీవల ముంబయిలో నిర్వహించిన ‘వోగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌తో కలిసి ఓ వీడియోను రూపొందించారు.

తాజాగా కత్రినా తన బ్యూటీ ప్రొడక్ట్స్‌ ప్రచారం కోసం నయనతారతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. దీనికి సంబంధించిన ఓ క్లిప్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకొన్నారు. ‘సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ నా బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయికు వచ్చి వీడియో షూట్‌లో పాల్గొన్నందుకు నయనతారకు ధన్యవాదాలు’ అని కత్రినా తెలిపారు. నయన్ కూడా కత్రిన బ్రాండ్ ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియోని షేర్ చేసింది.