శ్రీముఖి కోసం రంగంలోకి దిగిన రష్మీ !


కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకొంది. టైటిల్ రేసులో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయ్. ఫైనల్ గా శ్రీముఖి, రాహుల్ మధ్య గట్టిపోటీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరి మెట్టుమీద శ్రీముఖిని నిలబెట్టేందుకు హాట్ యాంకర్ రష్మి రంగంలోకి దిగింది. శ్రీముఖికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ.. రష్మీ ఓ వీడియోని విడుదల చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చిన కంటెస్టర్స్ మాత్రం రాహుల్ టైటిల్ గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాహుల్ విన్నర్ గా నిలుస్తాడని మహేష్ విట్టా చెప్పిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బిగ్ బాస్ యాజమాన్యంతో శ్రీముఖి రాజకీయాలు చేసోంది. బిగ్ బాస్ టీం అంతా ఆమెకి తెలిసిన వాళ్లే. రాజకీయాలు జరిగితే మాత్రం శ్రీముఖి విజేతగా నిలుస్తుందనే ప్రచారం ఉంది.మరీ.. ఫైనల్ గా బిగ్ బాస్ 3 విజేత ఎవరు ? అవుతారు అన్నది చూడాలి.