వైరల్ : మహేష్ ఫ్యామిలీ యాడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ఫ్యామిలీతో కలిసి దిగిపోయాడు. మహేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్ లని పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సాయి సూర్య డెవలెపర్స్’ కోసం మహేష్ తో కలిసి యాడ్ చేశారు. ఈ ప్రకటనలో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార కూడా భాగస్వాములు కావడం సూపర్ స్టార్ అభిమానులను కనువిందు చేస్తోంది.

‘మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్ చేశారు. కానీ నేను కూడా మీలో ఒకడినే. మీ అందరి లాగే నాకు కూడా నా ఫ్యామిలీయే నా లైఫ్ లైన్. నా ఇల్లే నా ప్రపంచం. నా వాళ్ళనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా.. సాయి సూర్య డెవలెపర్స్’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన వీడియా అదిరిపోయింది. తాజాగా ఈ వీడియోను మహేష్ తన ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. భార్యాపిల్లలతో ఇదే తొలిసారి అని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడీ యాడ్ వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర్-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి12 సరిలేరు.. ప్రేక్షకుల ముందుకు రానుంది.