బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసిన వెంకీ !

విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ పట్టేయడం ఏంటీ అనుకొంటున్నారా ? కానీ ఇదీ నిజం. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న తమిళ చిత్రం ‘అసురన్’. ధనుష్ హీరో. ఇప్పుడు ఆ సినిమాను విక్టరీ వెంకటేష్ తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యారు. వెంకీ ఈ సినిమా చూసిన వెంటనే తెలుగు రిమేక్ ని ఓకే చేయడం విశేషం. సాధారణంగా వెంకీ అంతా ఈజీగా కథని ఓకే చేయడం. కానీ, అసురన్ వెంకీని బాగా ఆకట్టుకొన్నట్టు కనిపిస్తోంది. తెలుగులో ఎవరు డైరక్ట్ చేస్తారు? మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

తమిళ నవల ఆధారంగా తీసిన సినిమా అసురన్. బలమైన, బలహీనమైన వర్గాలు, వాటి మధ్య అంతరాలు, కక్షలు, దాడులు, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చోటు చేసుకున్న సినిమా.  ఓ పేదవాడి కుటుంబానికి, డబ్బున్న వాడి కుటుంబానికి మధ్య సాగే పోరు. ఇందులో ధనుష్ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయ్. మహేష్ బాబు, రామ్ చరణ్, కరణ్ జోహార్ తదితరులు అసురన్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అంతేకాదు.. అసురన్ రిమేక్ లో నటించేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూఫుతున్నారనే వార్తలొచ్చాయ్. ఇంతలో వెంకీ అసురన్ రిమేక్ ని అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.

ఇక ‘అసురన్’ బంపర్ వసూళ్లు సాధిస్తుంది. రూ. 100 కోట్లు అధిగమించి ఏకంగా 150 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే. ధనుష్ కెరీర్ లో తొలి 150 కోట్ల క్లబ్ సినిమాగా నిలిచింది. ఇంకా అసురన్ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. దీపావళీ సీజన్ లో కూడా అసురన్ హవా చూపించేలా ఉన్నాడు. దీంతో అసురన్ దగ్గర దగ్గరగా రూ. 200కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది.