నిర్మాతపై రానా ఆగ్రహం

శివకుమార్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 1945. ఇందులో రానా సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. రెజీనా కథానాయిక. దీపావళి సందర్భంగా 1945 సినిమా ఫస్ట్ లుక్ ను ఆదివారం సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. దీనిపై రానా షాకింగ్ ట్విట్ చేశారు.  

“ఇది ఒక అసంపూర్ణమైన చిత్రం. సినిమాను నిర్మించే విషయంలో నిర్మాత విఫలమయ్యాడు. దాంతో ఈ సినిమా అసంపూర్ణంగానే ఉంది. సంవత్సరం నుంచి నేను వాళ్లను కలవలేదు. పోస్టర్ ను విడుదల చేయడమనేది డబ్బులు సంపాదన కోసం చేసిన మోసపు ఆలోచనలా అనిపిస్తోంది. దయచేసి దీనిని ప్రోత్సహించకండి” అంటూ రానా ట్విట్ చేశారు.

రానా ట్వీట్ పై నిర్మాత రాజరాజన్ స్పందించారు. “సినిమా పూర్తయ్యిందా, లేదా అనేది దర్శకుడు నిర్ణయిస్తాడు. సినిమా పూర్తయ్యిందో.. లేదో ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి. 60 రోజుల షూటింగ్ కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశాను. అసంపూర్ణమైన చిత్రాన్ని ఎవరూ విడుదల చేయరు” అని రిప్లై ఇచ్చారు. దాంతో నిర్మాత రాజ రాజన్ తో రానాకు విబేధాలున్నాయని, ఇక 1945 ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేదన్నది స్పష్టం అయింది.