వైసీపీకి దగ్గుపాటి గుడ్ బై !


అనుకొన్నదే జరిగింది. దగ్గుపాటి వెంకటేశ్వరావు వైకాపాని వీడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అతడి తనయుడు హితేష్ వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాల వలన హితేష్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. దగ్గుపాటి పోటీ చేసిన ఆయనకి తొలిసారి ఓటమి తప్పలేదు. దీనికితోడు భార్య పురంధేశ్వరి బీజేపీలోనే ఉండటానికి మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు వైకాపాని వీడటానికి నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన సీఎం జగన్ కి ఫోన్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా పనిచేసని రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడంపై తనకు సమాచారం లేదని దగ్గుబాటి అన్నారు. తనతో పాటు కుమారుడు హితేష్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే మళ్లీ బీజేపీకి గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది.