‘పెళ్ళి చూపులు’ జంట పార్టీ చేసుకొంది !

ప్రశాంత్, చిత్ర మళ్లీ కలిశారు. పార్టీ చేసుకొన్నారు. ఇంతకీ ఈ ప్రశాంత్, చిత్ర ఎవరు అనుకొంటున్నారా ? ‘పెళ్ళి చూపులు’ జంట. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘పెళ్లి చూపులు’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. 2016లో చిన్ని సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకొంది. విజయ్ దేవరకొండకి తొలి హిట్ ఇచ్చిన చిత్రమిది.

ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలని మించిన క్రేజ్ సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు విజయ్ ఓ సంచలనం. ఇక రీతూ వర్మ మంచి నటి అనిపించుకొంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. కానీ, స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు. ఇటీవల విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కలిసి పార్టీ చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు, ఎక్కడ అన్న విషయాలు తెలీదు. కానీ, వీరిద్దరు హ్యాపీ, పార్టీ మూడ్ లో ఉన్న పిక్స్ బయటికొచ్చాయ్.